మహారాష్ట్రలో బీజేపీ బలపరీక్షపై నేడు సుప్రీం విచారణ

-

మహారాష్ట్రలో బీజేపీ ఆగమేఘాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, బలపరీక్షకు గవర్నర్ వారం రోజులు గడువు ఇవ్వడంపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మండిపడ్డాయి. మహారాష్ట్ర గవర్నర్ దేవేంద్ర ఫడ్నవిస్‌ను నవంబర్ 23 న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించిన ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా వారు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశాయి. తమకు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాయి.

అంతేకాదు, ఫడ్నవిస్ ప్రభుత్వం నేడు బలపరీక్ష నిర్వహించేలా చూడాలని కోరాయి. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని మూడు పార్టీలు అభ్యర్థించాయి. అంగీకరించిన సుప్రీంకోర్టు నేటి ఉదయం 11:30లకు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news