ఇంకో ఇద్దరిని బలి తీసుకున్న గాలిపటం.. మృతుల సంఖ్య తొమ్మిదికి..!

-

సంక్రాంతి సందర్భంగా పిల్లలు, పెద్దలు కూడా గాలిపటాలని ఎగరడానికి ఇష్టపడుతూ ఉంటారు. సంక్రాంతి పండుగ పూట గాలిపటం ఎగరవేయడం సరదాగా ఉంటుంది. అయితే ఈ సరదా ఇద్దరిని బలి తీసుకుంది ఇంకో ఇద్దరు గాలిపటం కారణంగా బలైపోయారు. నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్ మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహమత్ నగర్ లో ఒక ఐదు అంతస్తుల భవనం మీద నుండి గాలిపటాన్ని ఎగరవేస్తూ కిందపడిపోయి కపిల్ దేవ్ చౌహాన్ అనే యువకుడు మృతి చెందాడు.

జవహర్ నగర్ కి చెందిన పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగవ తరగతి చదువుతున్న భావన సాయి కూడా బిల్డింగ్ మీద నుండి కిందకు పడిపోయి మృతి చెందాడు. భావన సాయి వయసు 9 సంవత్సరాలు మాత్రమే బిల్డింగ్ మీద నుండి గాలిపటం వేయడం వలన కింద పడిపోయినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూ మృతి చెందాడు భావన సాయి. ఇలా గాలిపటాలు ఎగరవేస్తూ చనిపోయిన వాళ్ళ సంఖ్య తొమ్మిది కి చేరింది. కపిల్ దేవ్ చౌహన్ తన స్నేహితుడితో కలిపి గాలిపటాన్ని ఎగురువేయడానికి వెళ్ళాడు. అతని మృతి పై తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకి కంప్లైంట్ చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news