PAWAN KALYAN : ”భీమ్లా నాయక్” లో నిత్యా మీనన్ ఫిక్స్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది.

ఈ నేపథ్యంలోనే.. వారం రోజుల కింద ఈ సినిమా మేకింగ్ వీడియో ను చిత్ర బృందం రీలిజ్ చేసింది. ఈ మేకింగ్‌ వీడియోతో పవన్‌ ఫ్యాన్స్‌ కొత్త కోలహలం మొదలైంది. అయితే…. ఈ ఉత్సాహం నుంచి పవన్‌ ఫ్యాన్స్‌ తేరుకోకముందే… ఈ బీమ్లా నాయక్‌ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్‌ వచ్చింది.

ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ నిత్యామీనన్‌ నటిస్తున్నట్లు చిత్ర బృందం కాసేపటి క్రితమే ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేసింది బీమ్లా నాయక్‌ టీం. అయితే… నిత్యామీనన్‌… పవన్‌ కళ్యాణ్‌ సరసన నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. గీతా గోవిందం సినిమా తర్వాత…పవన్‌ సినిమాతో టాలీవుడ్‌ లోకి నిత్యామీనన్‌ రీ ఎంట్రీ ఇవ్వునుంది.

Read more RELATED
Recommended to you

Latest news