ఆ స్టార్ హీరో కోసం గొడవ పడుతున్న నివేదా థామస్- రెజీనా కసాండ్రా..కారణం..?

-

హాట్ బ్యూటీస్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజీనా కసాండ్రా, నివేదా థామస్ తాజాగా నటిస్తున్న సినిమా శాకిని డాకిని.. ఇక వచ్చే వారం ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో శరవేగంగా పాల్గొంటున్నారు. ఇక రేజీనా ,నివేదా ఇద్దరు కూడా వరుస ప్రెస్ మీట్ లు, వరుస ఇంటర్వ్యూలు చేస్తూ మరింతగా పాపులారిటీని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు . ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా, నివేదా ఇద్దరు కూడా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి..

ఇక ఎన్టీఆర్ తో కలిసి జై లవకుశ సినిమాలో నివేదా థామస్ నటించింది. ఆయనతో పనిచేసిన అనుభవం ఉండడంతో తారక్ గురించి ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది . ఇక ఎన్టీఆర్ ఎనర్జీ అద్భుతం అని , ఎప్పుడు ఎంత పని చేసినా కూడా అలసిపోవడం అంటూ ఉండదు అని, షూటింగ్ కి వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉంటారో..ఇంటికి వెళ్లేటప్పుడు కూడా అలాగే ఉంటారు అని నివేదా వెల్లడించింది. ఇక రెజీనా కూడా తగ్గేదేలే అంటూ ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పేసింది.. మంచివాడు అని, మనసున్న వాడు అని తనను చాలా సార్లు అభినందించారు అని .. చాలా అరుదుగా అలా జరుగుతుంది అని రెజీనా వెల్లడించింది. అంతేకాదు తారక్ పుట్టుకతోనే మంచి మనసుతో పుట్టాడు అని కమలహాసన్ ,ఎన్టీఆర్ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారని కూడా తెలిపింది..

అంతేకాదు ఒకవైపు రెజీనా , మరొకవైపు నివేదా ఇద్దరు కూడా తమ మాటలతో ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు.. ఇద్దరు స్టార్ హీరోయిన్లు పోటీపడి మరి ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతుండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ నటించిన ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news