విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల విగ్రహలు ఉండకూడదు : అనకాపల్లి ఎంపీ

-

ఆంధ్ర యూనివర్సిటీలో చాలా అక్రమాలు, అన్యాయాలు జరిగాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన వదిలేది లేదని, ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేస్తామని సీఎం రమేష్ అన్నారు.ఏయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్టర్ జేమ్స్ స్టీఫెన్ రాజీనామాలతో యూనివర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీ సమయంలో చేసిన అక్రమాలపై, చర్యలు తీసుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఈ రోజు(శనివారం) ఏయూలో ఎంపీ సీఎం రమేష్, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి వంశీకృష్ణ యాదవ్ రాజీనామాలతో యూనివర్సిటీలో పర్యటించారు. ఉద్యోగులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. న్యాయపరమైన విచారణ చేయిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయంలో రాజకీయాలు ఉండకూడదని అన్నారు. విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల విగ్రహలు ఉండకూడదన్నారు. అధ్యాపకులు,విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోని ముందుకు వెళ్తామని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. మరోవైపు దేశంలో ఎక్కడలేని విధంగా స్పెషల్ ఎగ్జామ్స్ నిర్వహించారని భీమీలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏయూలో ప్రసాద్ రెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news