డీజీపీకి మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ

-

తన పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు.అత్యవసరంగా డబ్బులు కావాలంటూ తన పేరుతో ప్రముఖులకు ఫోన్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో ఫిర్యాదు చేసిన ఇంకా అగంతకుడు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడు.జోగయ్య పేరుతో వచ్చిన కాల్స్ తో మోసపోయి డబ్బులు పంపిన వారి జాబితాలో జానారెడ్డి, కామినేని శ్రీనివాస్ , మోత్కుపల్లి నరసింహులు, కొత్తపల్లి సుబ్బారాయుడు,వి. హనుమంతరావు ఉన్నారు.7801096535 నెంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటూ మాజీమంత్రి హరిరామ జోగయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news