హుజూర్ నగర్ బరిలో ఎంత మందంటే..

-

హుజూర్ నగర్ ఉప ఎన్నిక నగారా మోగడంతో తెలంగాణాలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. అన్ని పార్టీలు హుజూర్ నగర్ లో గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నాయి. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. నేడు మధ్యాహ్నం మూడు గంటలతో నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఉప ఎన్నికలో పోటీకి భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే హుజూర్ నగర్‌లో నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య 119కి చేరుకుంది. అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, సీపీఎం నుంచి పారేపల్లి శేఖర్ రావు, స్వత్రంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేశారు.

వీరితో పాటు మరో 115 మంది ఇండిపెండెంట్ట్లు గా నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాదులో కేసీఆర్ కూతురు కవితను ఏ విధంగా ఓడించామో ఇక్కడ కూడా సైదిరెడ్డిని గెలువకుండా పోటీ చేస్తున్నట్లు ఇంతకుముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు ప్రకటించారు. అలాగే మాజీ సర్పంచ్ లు, విద్యార్థి నాయకులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాల నుంచి చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 21న ఎన్నికలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news