చనిపోయి బాధలో ఉంటే సెల్ఫీలా.! మైండ్ ఉందా.!

-

సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త విని తెలుగు సినిమా ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వేల మంది అభిమానులు కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంతిమ యాత్ర లో భారమైన హృదయంతో పాల్గొన్నారు. ఇక హీరో మహేష్ వారి కుటుంబ సభ్యుల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు.

వచ్చే పోయే సెలబ్రిటీల తో వారు బాగా  ఇబ్బంది పడ్డారు. ఈ సందర్బంగా ఒక షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇంత బాధలో వాళ్లు వుంటే కొంత మంది సెల్ఫి రాయుళ్లు మహేశ్ బాబు తో  సెల్ఫీ ల కోసం ప్రయత్నం చేశారట. అసలే బాధలో ఉన్న వారికి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో నెట్టారట.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి ఎంత చదువుకున్నా కూడా వివేకం లేకుండా పోయింది. విచక్షణ లేకుండా సెల్ఫీలు అడగడం ఏంటని సోషల్ మీడియాలో ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.అసలే బాధలో ఉన్న వారిని సెల్ఫీలు అడిగి వారిని ఇబ్బంది పెట్టడం ఏంటని మండి పడుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news