ఒక్కరు కాదు ఇద్దరు కోహ్లీలు.. విరాట్ పోస్ట్ వైరల్..?

-

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ మేటి బ్యాట్స్మెన్లలో ఒకడైన కోహ్లీ ప్రస్తుతం విజయవంతమైన సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఇక ప్రతి మ్యాచ్ లో కీలక ఆటగాడిగా మారుతూ టీమిండియాకు ఎన్నో విషయాలను కూడా అందించాడు. అంతే కాకుండా ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొడుతూ రికార్డుల రారాజు గా మారిపోయాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగాడు అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

అయితే విరాట్ కోహ్లీ ఈ రోజుకి భారత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 12 సంవత్సరాలు పూర్తయింది.ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఫోటో సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకున్న విరాట్ కోహ్లీ ఇన్ని రోజుల వరకు తనపై ఎంతగానో ప్రేమ అభిమానం చూపించి తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞుడిని అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. తన ఎడిటింగ్ ప్రతిభను ఉపయోగించి ఒకేసారి ఇద్దరు విరాట్ కోహ్లీలు పిడికిలి గుద్దుతున్నట్లుగా ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news