నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ – 1 నోటిఫికేషన్ రిలీజ్

-

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. తాజాగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఏకంగా 92 గ్రూప్1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది ఎపీపీఎస్సీ. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.

అలాగే.. ఎఎంవీఐ ఉద్యోగాలకు నవంబర్ 2 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు చేసింది. అలాగే… ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయోపరిమితి పెంపు వెసులుబాటును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. 2021 సెప్టెంబర్ 27 న జారీ చేసిన జీవో 105 ఉత్తర్వులను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగించింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news