కుప్పంలో ఉద్రిక్తత..ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య రేగిన చిచ్చు..టికెట్లు చించేసిన అభిమానులు

-

తిరుపతి : ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల అయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో.. అభిమానులతో.. థియేటర్లు కలకలాడుతున్నాయి. టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. చంద్రబాబు ఇలాక అయిన కుప్పంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేగింది.. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫాన్సీ షో టిక్కెట్ల విషయంలో అభిమానుల మధ్య రగడ నెలకొంది.

ఫ్యాన్సీ షో టికెట్ల పై ఓ హీరో అభిమాన సంఘం నేతల పేర్లు ముద్రించడంపై వివాదం మొదలైంది. దీంతో థియేటర్ ఎదుటే ఫ్యాన్సీ షో టికెట్లను అభిమానులు చించివేశారు. కుప్పంలోని మూడు థియేటర్లలో మూడు బెనిఫిట్ షోలకు సంబంధించి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫోటోలతో మూడు వేల టికెట్లు ముద్రించారు అభిమానులు.

అయితే… కుప్పంలో మూడు థియేటర్లలో రిలీజ్ అయింది త్రిబుల్ ఆర్ మూవీ.. త్రిబుల్ ఆర్ సినిమా టికెట్లపై కొంతమంది అభిమాన సంఘం నేతల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉండటమే అభిమానుల మధ్య గొడవకు కారణమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news