టీడీపీని లాక్కుంటే ఎన్టీఆర్ ఇంత కంటే ఎక్కువ ఏడ్చారు- కొడాలి నాని

-

తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి చంద్ర బాబు లాక్కుంటే ఎన్టీఆర్ ఇంత కంటే ఎక్కువ గా ఏడ్చార‌ని మంత్రి కొడాలి నాని అన్నారు. కాని ఆయ‌న చంద్ర బాబు ల బ‌య‌ట కు వచ్చి ఏడ్వ‌లేద‌ని అన్నారు. అలాగే రాజకీయంగా బ్రతకడానికి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం భార్యాను కూడా బజారుకు ఇడ్చాడని విమర్శించారు. చంద్రబాబు సతీమణి పై ఎవరు వ్యాఖ్యలు చేశారో, ఏమని వ్యాఖ్యానించారో ఎందుకు చెప్పటం లేదని ప్ర‌శ్నించారు.

తాము ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఆన్ రికార్డు ఉంటాయి కదా వాటిని చూపాల‌ని డిమాండ్ చేశాడు. సానుభూతి కోసం తాము తన సతీమణి పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశామ‌ని అబ‌ద్ధాలు చెబుత‌న్నాడ‌ని అన్నాడు. చంద్రబాబును ఏమి చేయాలో ఆ పార్టీ ఎమ్మెల్యే లే ఆలోచించుకోవాలని సూచించారు. అలాగే భార్యను కించపరుస్తు వ్యాఖ్యలు చేస్తే తాను ముఖ్యమంత్రి అవుతాను అని శపథం చేయటానికి అర్థం ఏమైనా ఉందా కొడాలి నాని ప్ర‌శ్నించారు. గొడవ అయిన తరువాత చంద్ర బాబు నవ్వుకుంటు సభ నుండి బయటకు వ‌చ్చార‌ని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news