ఎన్టీఆర్ షోలో కోటి గెలుచుకున్న కొత్త‌గూడెం ఎస్సై..!

-

జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు పలువురు ప్రముఖులు విచ్చేసి ప్రేక్షకులను అలరించారు. రామ్ చరణ్, రాజమౌళి తో పాటు పలువురు హీరోలు హీరోయిన్ లు వచ్చి ఆకట్టుకున్నారు. ఇక తాజాగా ఈ షోలో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ఓ ఎస్సై పాల్గొన్నారు. సుజాతనగర్ మండలానికి చెందిన ఎస్సై బి. రాఘవేంద్ర పాల్గొన్నారు. అయితే తాజాగా రాఘవేంద్ర కోటి రూపాయలు గెలుచుకున్న‌ట్టు తెలుస్తోంది.

ntr evaru melo koteeshwerudu kotthagudem si
ntr evaru melo koteeshwerudu kotthagudem si

ఆయన మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్న‌ట్టు సమాచారం. ఇక తాజాగా వచ్చిన ప్రోమోలో ఎన్టీఆర్ కోటి రూపాయల ప్రశ్న అడ‌గ్గా రాఘవేంద్ర సమాధానం చెప్పి లాక్ చేయడం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఇక ఈ షో రేపు ప్రసారం కావాల్సి ఉండగా ఇప్పటికే రాఘ‌వేంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నారు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై నిర్వాహకులు ఇంకా స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news