అంబటి రాంబాబును టార్గెట్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..ఎందుకంటే..?

-

కొన్ని సందర్భాలలో అంబటి రాంబాబు మాటలు శృతిమించుతుండడంతో ఆయన ఇమేజ్ బాగా డామేజ్ అయిపోతోంది. అంతకంతకు ఆయనకు శత్రువులు పెరిగిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అందరినీ శత్రువులు గా మార్చుకున్నాడు. బేసిగ్గా తారక్ అభిమానులు ఎక్కువగా టిడిపి మద్దతుదారులు గానే ఉంటారు కాబట్టి.. రాంబాబు వారికి శత్రువే. అయితే తటస్థంగా ఉండే తారక్ అభిమానులకు కూడా ఆయన ఇప్పుడు విలన్ గా అయిపోయారు. దీనికి కారణం రాంబాబు నోటి దురుసే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని, ఆయన తనయుడు లోకేష్ ను విమర్శించే క్రమంలో ఆయన అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ పేరెత్తి కొత్త వివాదాన్ని కొనితెచ్చుకున్నాడు.

లోకేష్ కాకపోతే టిడిపి ని జూనియర్ ఎన్టీఆర్ నడిపించవచ్చని, అయినా ఆ పార్టీ బాగుపడదని చెప్పే క్రమంలో.. “లోకేష్ కాకపోతే జూనియర్ ఎన్టీఆరో బోనియర్ ఎన్టీఆరో” అంటూ తారక్ ని తేలిక చేసి మాట్లాడారు. ఈ కామెంట్ తారక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. సోమవారం సాయంత్రం నుంచి వాళ్ళు రాంబాబును లక్ష్యంగా చేసుకున్నారు. రాంబాబు పేరు మీద లీకైన శృంగార సంభాషణల తాలూకు ఆడియోలను పెడుతూ.. ఆయన్ని బూతులు తిడుతూ.. పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాక రాంబాబు చేసినదానికి ఏపీ సీఎం జగన్ క్షమాపణ చెప్పాలంటూ..#jaganshouldapologijrntr ఎన్టీఆర్. అనే హ్యష్ స్టాగ్ కూడా పెట్టి ట్రెండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version