నేడు యాదాద్రిని దర్శించుకోనునున్న సీజేఐ ఎన్వీ రమణ..

-

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, నేడు యాదాద్రిని దర్శించుకోనున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి సన్నిధానానికి బయలు దేరనున్నారు. అటు సీజేఐతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై కూడా యాదాద్రికి బయలు దేరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఆలయ నిర్మాణం గురించిన అనేక ఫోటోలు, వీడియోలు విడుదల అయ్యాయి. ఇటీవల విడుదల ఫోటోలు యాదాద్రి ఆలయ వైభవాన్ని చాటుతున్నాయి. లైట్ల వెలుతురులో ఆలయ శోభ మెరిసిపోతుంది. తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తుంది. ప్రస్తుతం తెలుగువారైన ఎన్వీ రమణ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వైభవాన్నిదర్శించనున్నారు. ఇప్పటికే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version