గుంటూరు కారం నుంచి ‘ఓ మై బేబీ’ వీడియో సాంగ్ విడుదల

-

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఈ సినిమా నుంచి ‘ఓ మై బేబీ’ ఫుల్ వీడియో సాంగ్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా నిన్న ఈ చిత్రంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. అయితే ఈ సాంగ్ ఇప్పటికే 40 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా రమ్యకృష్ణ, జయరాం,మురళి శర్మ, ప్రకాష్ రాజ్, ఈశ్వరరావు,వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. హారిక అండ్ హసన్ క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Read more RELATED
Recommended to you

Latest news