మెదక్ జిల్లాలో దారుణం..17ఏళ్ల బాలికపై 65ఏళ్ల వృద్దుడు అత్యాచారం..!

-

తెలంగాణ లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న సింగరేణి కాలనీలో జరిగిన దారుణం ఇంకా మర్చిపోనెలేదు. ఇంతలోనే మరికొన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి . తాజాగా మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక (17) పై 65ఏళ్ల వృద్దుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇంట్లో టీవీ చూడటానికి వచ్చిన సమయంలో అఘాయిత్యానికి పాల్పడిన వృద్ధుడు. బాలిక అస్వస్థతకు గురికాగా వైద్య పరీక్షలు నిర్వహించగా.. గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారంచారు. అనంతరం బాలిక తల్లి తండ్రులు నిజాంపేట పోలీసులకు పిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు పై మాత్రం నోరు మెదపడం లేదు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడం తో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news