Samantha: “ఈ స‌మాజం మ‌గాళ్ల‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌దు?” మనసులోని బాధను బయటపెట్టిన సమంత‌

-

Samantha: అక్కినేని నాగ చైతన్య- సమంత‌ ల వివాహం మునాళ్ల ముచ్చటే అయ్యింది. ఏడేండ్ల ప్రేమ‌, మూడేళ్ల వివాహ‌బంధాల‌కు పుల్ స్టాప్ పెట్టారు ఈ జంట‌. ఇక వైవాహిక బంధాన్ని కొనసాగలించలేమ‌ని, కేవ‌లం స్నేహితులుగానే ఉండాల‌నుకుంటున్నామ‌ని సోషల్‌ మీడియా వేదికగా సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో ఇండ‌స్ట్రీతో పాటు సర్వ‌త్రా విస్మయానికి గురయ్యారు.

 

అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా అని పలువురు ఆరా తీస్తుంటే.. మ‌రికొంద‌రూ స‌మంతను టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ కంటెంట్ చేసింద‌నీ, గ్లామరస్‌ ఫోటో షూట్‌లే చేసింద‌నీ, మ‌రికొంద‌రూ ఓ లైన్ దాటి.. ఆమె స్టైలిస్ట్‌ ప్రీతమ్‌తో ఎఫైర్ ఉంద‌నీ దారుణంగా ట్రోల్ చూస్తూ నిందలేస్తున్నారు.

ఇవే విడాకుల‌కు కార‌ణాల‌ని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కొంద‌రూ సమంతకు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చారు. కానీ ట్రోల్స్ ఆగ‌డంలేదు.ఈ క్రమంలో సమంత తన మనసులోని బాధను బహిర్గతం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. మహిళలను ప్రశ్నించే ఈ స‌మాజం.. అదే మగాళ్ల‌ను ఎందుకు ప్రశ్నించదు. అంటే మనకు ప్రాథమికంగా నైతికత లేనట్టేనా అంటూ కామెంట్ పోస్టు చేసింది. ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

నాగ‌చైత‌న్య నుంచి దూర‌మ‌య్యాక స‌మంత చాలా బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షాట్‌ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. విడాకుల ప్రకటనతో సమంత కుంగిపోయినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news