మరోసారి పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం

-

గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆయన టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల ఆయన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఆయన పార్టీ మారుతున్నట్లు వచ్చే వార్తలను నిజం చేస్తూ ఆయన వ్యవహార శైలి కొనసాగుతుంది. టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పొంగులేటి.

అంతేకాకుండా ఆత్మీయ సమ్మేళనం పేరుతో కొద్దిరోజులుగా తన అభిమానులు, కార్యకర్తలను కలుస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఇల్లందులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పొంగులేటి.. తాజాగా మరోసారి తన అనుచరులతో సమావేశం కానున్నారు. రేపు మధిర నియోజకవర్గం లో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని, అనుచరులు హాజరుకావాలని ఆహ్వానం పంపారు. పార్టీ మార్పుపై అభిప్రాయాలను సేకరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news