విజయవాడ దివ్య కేసులో మరో ట్విస్ట్.. రెండేళ్ళ క్రితమే విడిపోయాం !

-

విజయవాడ దివ్య తేజస్విని కేసు గంట గంటకూ ఓ మలుపు తిరుగుతోంది. ముందు ప్రేమించడం లేదని చంపేసినట్టు చెప్పారు. తరువాత ఇద్దరికీ పెళ్లి జరిగింది, ఆ తరువాత అమ్మాయి తల్లితండ్రులు కలిసి బ్రతకనివ్వరని, ఇద్దరం కలిసి ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పాడు నిందితుడు.

అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ పాత వీడియోలో మాత్రం దివ్య తాను ఒకప్పుడు రిలేషన్ లో ఉన్న మాట నిజమే కానీ, అతని శాడిజం తట్టుకోలేక విడిపోయానని చెప్పుకొచ్చింది. అలానే తనను చూసుకోడానికి తన అన్న ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చింది. ఈ లెక్కన ఆమె అతనితో విడిపోయిందనే చంపేశాడని అర్ధం అవుతోంది. ఇక తమ కుమార్తెని నాగేంద్ర కావాలనే చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని, ఆ ఫొటోలు గ్రాఫిక్స్ అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news