తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడికిపోయింది.. ఓవైసీ

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సై అనడంతో తెలుగువారి ఆత్మగౌరవం ఎటు పోయింది అంటూ  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చంద్రబాబుని  ప్రశ్నించారు. నాలుగేళ్లు భాజపాతో అంటకాగి, ఇప్పుడు బాబు డ్రామాలు చేస్తున్నారన్నారు. 2019 తర్వాత భాజపాతో తెదేపా మళ్లీ కలడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు.  నాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే నేడు అదే పార్టీతో కలిసి దోస్తీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాట్లాడితే తెలుగువారి ఆత్మగౌరవం అనే చంద్రబాబు ఇప్పుడేమైంది మీకు అంటూ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తెదేపా – కాంగ్రెస్ పొత్తుని ప్రజలు తిప్పికొడతారు, ఈ రెండు పార్టీలో పొత్తు పేరుతో నిండామునిగాయని పేర్కొన్నారు. తనకున్న సమాచారం, సర్వేల ప్రకారం మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా దళితులు, ముస్లింల పై దాడి జరిగినప్పుడు నోరుకూడా విప్పని చంద్రబాబు ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరతీశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news