మళ్లీ బ్యాట్ పట్టి చెలరేగిన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్!

-

వీరేంద్ర సెహ్వాగ్.. ఓ మెరుపు. ఓపెనర్ సెహ్వాగ్ బ్యాటింగ్ కు వస్తున్నాడంటేనే అటు ఫీల్డర్లు, ఇటు బౌలర్లు వణికేవారు. కొడితే సిక్సే లేకపోతే డకౌట్. అంతే. మామూలు రన్స్ తీసే ప్రసక్తే లేదు. ఫటా ఫటా సిక్సులు, ఫోర్లు బాదాల్సిందే. లేదంటే పెవిలియన్ బాట పట్టాల్సిందే. అది ఓపెనర్ బ్యాటింగ్ స్టయిల్. అవన్నీ సరేగానీ.. 2013లోనే తన అంతర్జాతీయ క్రికెట్ కు వీరూ గుడ్ బై చెప్పాడు కదా మళ్లీ బ్యాట్ పట్టడమేంటని నెత్తి గోక్కోకండి. ఐపీఎల్ కూడా అయిపాయె అని ఆగమాగం కాకండి.

ఆయన మరోసారి బ్యాట్ పట్టింది కర్ణాటక చలన చిత్ర కప్ కోసం. అవును కేసీసీ పేరుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో బ్యాట్ పట్టి తన సత్తాను చాటాడు వీరు. మామూలుగా కాదు సిక్సులు బాది స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. కన్నడ హీరో కిచ్చ సుదీప్ కెప్టెన్ గా ఉన్న కదంబ లయన్స్ అనే జట్టులో సెహ్వాగ్ సభ్యుడట. దానిలో భాగంగానే ఓ మ్యాచ్ లో సెహ్వాగ్ ఇలా సిక్సర్ల వరదను సృష్టించాడు. ఆ సిక్సర్ల వరదకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు సెహ్వాగ్.

ఈ మ్యాచ్ లో కూడా ఓపెనర్ గానే బరిలోకి దిగిన సెహ్వాగ్ ఫస్ట్ ఓవర్ లోనే సిక్సు, ఫోర్లు బాదాడట. దీంతో స్టేడియమంతా చప్పట్లతో మార్మోగిపోయిందట. ఇక ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news