“పాలమూరు ప్రజాభేరి” సభలో జూపల్లి , దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరిక !

-

తెలంగాణాలో అధికారంలో ఉన్న BRS నుండి వచ్చేసిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇటీవల ఖమ్మం సభలో రాహుల్ గాంధీ సమక్షములో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అతనితో పాటు బయటకు వచ్చిన జూపల్లి కృష్ణారావు సైతం జులై 20వ తేదీన కొల్లాపూర్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నారు. ఈ సభకు పాలమూరు ప్రఝాభేరి అన్న పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇందుకోసం ఏర్పాట్లు అన్నీ గట్టిగానే సాగుతున్నాయి. టీపీసీసీ ఇప్పటికే 16 మంది సభ్యలతో కూడిన కమిటీని ఈ సభ ఏర్పాట్లను చూసుకోవడానికి ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ రానున్నారు, ఆమె సమక్షములో జూపల్లి కృష్ణారావు మరియు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి లు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు.

వీరు మాత్రమే కాకుండా మహబూబ్ నగర్ కు చెందిన చాలా మంది నేతలు కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నారు. ఇక ఈ సభను విజయవంతం చేయాల్సిన కీలక బాధ్యతను కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Latest news