క‌ల్యాణ్ రామ్‌తో ప‌టాస్-2 సిద్ధం.. ప్ర‌క‌టించిన అనిల్ రావిపూడి

-

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ హీరోగా 2015 లో అనిల్ రావిపూడి మొద‌టి సారి ద‌ర్శ‌క‌త్వం చేసిన సినిమా ప‌టాస్. ఈ సినిమా హిట్ తో అనిల్ రావిపూడి.. ర‌చియిత నుంచి పూర్తి కాలం డైరెక్ట‌ర్ గా మారాడు. ఈ సినిమా హిట్ తో అగ్ర హీరోలతో వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ – 2, స‌రిలేరు నీకెవ్వ‌రు వంటి హిట్ సినిమాల‌ను తెర‌కెక్కించాడు. తాజా గా ఎఫ్ – 2 సినిమాకు సిక్వెల్ గా ఎఫ్ – 3 సినిమా చేశాడు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ఈ సినిమాను మే 27 విడుద‌ల చేయ‌డానికి సిద్ధం చేస్తున్నారు.

కాగ అనిల్ రావిపూడికి డైరెక్ట‌ర్ గా అవ‌కాశం ఇచ్చిన.. క‌ల్యాణ్ రామ్ తో మ‌రో సారి చేయ‌నున్న‌ట్టు గ‌త కొద్ది రోజుల నుంచి వార్తలు వ‌స్తున్నాయి. తాజా గా అనిల్ రావిపూడి ఈ వార్త‌లపై స్పందించాడు. క‌ల్యాణ్ రామ్ తో త‌న సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు. అది కూడా ప‌టాస్ కు సీక్వెల్ గా ప‌టాస్ – 2 అని ప్ర‌క‌టించాడు. అయితే అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం ఎఫ్ – 3 బిజీ లో ఉన్నారు. దీని త‌ర్వాత తాజా గా బాల‌కృష్ణ‌తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవ‌ల ప్రారంభం అయింది. ఈ సినిమా షూటింగ్ ముగిసిన త‌ర్వాత.. పటాస్ – 2 ప‌ట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news