గాజువాక లో ఓడిపోతాను అని ముందే తెలుసు: పవన్ కళ్యాణ్

-

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. 2019లో 30 స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ అందరూ ఒత్తిడి చేస్తే వదిలేసాను అని అన్నారు. అలానే నేను ఓడిపోతున్నా అని కూడా నాకు తెలుసు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

భీమవరంలో కూడా ఓడి పోతాను అని తెలిసింది అని, అక్కడ నాకు ప్రచారం ముగిసిన వెంటనే తెలిసింది అని చెప్పారు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా గాజువాక ఎలాగో ఓడిపోతాను అని ముందే తెలుసు అని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవన్నీ తట్టుకుని నేను ఉన్నాను అని అన్నారు. 2 ఎంపీలు, 10 ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో వేస్తే జన సేన పార్టీకి గుర్తింపు వచ్చేది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news