విజయవాడలో ఓటేసిన పవన్ కళ్యాణ్..!

-

ఏపి ఎలక్షన్స్ లో అసెంబ్లీ పోలింగ్ కొనసాగుతుంది.. ప్రజలతో పాటుగా సిని సెలబ్రిటీస్ సైతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పులివెందులలో వైఎస్ జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభించారు.

ఇక లేటెస్ట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పటమటలోని పోలింగ్ కేంద్రనికి వచ్చిన పవన్ ఓటు వేశారు. పవన్ చూసేందుకు జనాలు బాగా ఎగబడ్డారు. ఓటు వేసిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు.

ఏపి ఎన్నికల పోలింగ్ లో ఎలక్షన్ కమీషన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల గంటల తరబడి ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ ద్వివేది ఓటేసేందుకు వెళ్లిన పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎం మొరాయించడం ఆశ్చర్యకరం.

Read more RELATED
Recommended to you

Latest news