పోలీసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు : పవన్

-

ఏపీలో రాజకీయాలు రోజు రోజు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని మరోసారి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా పవన్ కల్యాణ్ మీడియా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసులను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కానీ, పోలీసుల సమస్యలపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించడంలేదని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. పోలీసులకు భత్యాలు, లోన్లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. పోలీసుల భద్రత పేరుతో జీతం నుంచి తీసుకున్న సొమ్ము ఏంచేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు పవన్ కల్యాణ్.

పోలీసుల భద్రతానిధిని ఏంచేశారో పాలకులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్. పోలీసుల టీఏలు 14 నెలలుగా బకాయిలు ఉన్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన చిరుద్యోగులకు వేధింపులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. నంద్యాలలో కానిస్టేబుల్ హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు పవన్ కల్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version