పొందూరు వసంత్ మృతికి సంతాపం… 5 లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ !

-

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఈ సారి బలమైన ముద్రను వేయాలన్న కసితో జనసేన అధినేత వారాహి యాత్రతో విస్తృతంగా ప్రజల మధ్యన మీటింగ్ లను పెడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా స్పందిస్తూ ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పొందూరు గ్రామానికి చెందిన వసంత్ కుమార్ విద్యుత్ షాక్ వలన మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వార్త పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు.. ఈయన మాట్లాడుతూ జనసేన నేత వసంత్ కుమార్ మృతి మా పార్టీలో ఉన్న నేతలందరికీ చాలా లోటు అన్నారు. ఈ గ్రామంలో కరెంట్ తీగలు వేలాడుతున్నాయని పలుమార్లు ప్రభుత్వానికి చెప్పుకున్నా పట్టించుకోలేదని తన బాధను తెలియచేశారు పవన్. అయితే స్థానికంగా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లాలన్న ఉద్దేశ్యంతో ఈ కరెంట్ తీగలు వేలాడే దృశ్యాన్ని వీడియో తీయాలని ప్రయతించిన వసంత్ కుమార్ ప్రమాదవ శాత్తూ విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడ మరణించారు అని బాధపడ్డారు పవన్ కళ్యాణ్.

వసంత్ కుమార్ మృతికి పార్టీ అంతా సంతాపాన్ని తెలియచేస్తోంది.. అంతే కాకుండా ఈ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని అందిస్తాం అంటూ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version