బ్రేకింగ్: అర్జెంట్ గా ఢిల్లీకి పవన్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏది చేసినా గత వారం పది రోజుల నుంచి హాట్ టాపిక్ గానే ఉంది. ఆయన మాట్లాడే మాటలు, ఆయన చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి. ఇప్పుడు పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్… తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు.

ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులను కలవనున్న జనసేన అధినేత… కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉండవచ్చు. గ్రేటర్ ఎన్నికల వేళ ఆసక్తిరేపుతోన్న ఈ పర్యటన వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏంటీ అనేది స్పష్టత లేదు. కాని ఆయన మాత్రం రేపు ఢిల్లీలో అమరావతి గురించి చర్చించే అవకాశం ఉంది అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news