ఈ నాలుగేళ్లలో ప్రజలు సంతోషంగా ఉన్నారు – మంత్రి బొత్స

-

గత ఐదేళ్లలో ఎన్నో ఆకలి చావులు ఆత్మహత్యలు చూశామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కానీ ఈ నాలుగేళ్లలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది అని తెలిపారు. సామాన్యుల కోసం సంక్షేమం అందించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు.

విద్యారంగానికి 32 వేల కోట్లను ఈ బడ్జెట్ లో కేటాయించామని చెప్పారు. అలాగే వైద్య రంగానికి ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. కేంద్ర ప్రయోజిత పథకాల నిదులను బడ్జెట్ లో కలిపి చూపమని అనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇక ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులే అని చెప్పుకొచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news