జనసేన పార్టీ కార్యాలయానికి తరలివస్తున్న ప్రజలు… ఎందుకంటే..?

-

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టడం అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరుతున్నారు.పార్టీ కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయటకు వచ్చి స్వయంగా ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్న తర్వాత వారి వినతిపత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలు చెప్పుకొని వాటిని తీర్చాలనివిజ్ఞప్తి చేశారు. కొంతమంది అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన డిప్యూటీ సీఎం అప్పటికప్పుడే కొన్ని సమస్యలు పరిష్కరించారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి కాల పరిమితి నిర్ణయించి ఆలోగా పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news