హైదరాబాద్ ప్రజలు పశువులు కాదు, పౌరులు : అసవుద్దీన్ ఓవైసీ

-

హైదరాబాద్‌ను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఏఐఎంఐఎంకు లీజుకు ఇచ్చాయని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఘాటుగా స్పందించారు.తెలంగాణకు వచ్చి హైదరాబాద్ సీటును ఒవైసీకి లీజుకు ఇచ్చారని మోడీ అన్నారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదు, పౌరులు, రాజకీయ పార్టీల సొత్తు కాదు, 40 సంవత్సరాలుగా హైదరాబాద్ హిందుత్వ దుష్ట భావజాలాన్ని ఓడించి ఏఐఎంఐఎం కి అప్పగించింది. హిందుత్వ మళ్లీ ఓడిపోతుందని ఒవైసీ ఎక్స్(ట్విట్టర్) లో రాశారు.

అలాగే, మోడీపై విమర్శలు చేసిన ఆయన, మోడీ తన పార్టీకి ఎన్నికల బాండ్ల ద్వారా రూ.6,000 కోట్లు ఇచ్చిన వారికి ఇండియా దేశ ఆస్తులను లీజుకు ఇచ్చారు. మోడీ వారిని ఎంతగానో శాంతింపజేసారు అని అన్నారు.ఈ రోజు మొత్తం 70 కోట్ల మంది భారతీయుల కంటే 21 మంది సంపద కలిగి ఉన్న వారే ఆయనకు నిజమైన పరివార్ అని ఒవైసీ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news