కేసీఆర్‌పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు : కిషన్ రెడ్డి

-

లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత్‌ను రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలని, ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం 2025 నాటికి ఇండియాను పూర్తి హిందూ దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు .

ఈ క్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ కిషన్ రెడ్డి స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మొనగాడు కాదనిసంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి కుర్చీ కదులుతుందని భయంతోనే బీజేపీపై ఆయన పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో లేదని.. తమ అజెండాలో లేని అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ చేస్తోన్న మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కేసీఆర్‌పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పట్టం గట్టాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news