‘జగన్‌.. ఓ పిచ్చి మారాజు’.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ ‘సీఎం జగన్‌ పిచ్చి మారాజంటూ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సొంత మనిషని జగన్ నమ్మారని.. ఇప్పుడు కోటంరెడ్డి నమ్మకద్రోహం చేశారని పేర్కొన్నారు. ‘చచ్చేవరకూ వైసీపీలో ఉంటానని, తాను మరణిస్తే సీఎం హోదాలో జగన్‌ వచ్చి తన శవంపై దండవేయాలని గతంలో కోటంరెడ్డి అన్న మాటలను జగన్‌ నిజమని నమ్మారని గుర్తుచేశారు. అందుకే శ్రీధర్‌రెడ్డి తేడాగా ఉన్నారని ఎందరు చెప్పినా పట్టించుకోలేదని వెల్లడించారు.

‘ఇంటెలిజెన్స్‌ అధిపతి పంపారని కోటంరెడ్డి చెబుతున్న వీడియోతో పాటు దానికింద టైపుచేసిన మెసేజ్‌లో ఏముందో చూడాలి. ఆరేడు నెలల శ్రీధర్‌రెడ్డి వాట్సప్‌ సందేశాలను మీడియా ముందు పెట్టమనండి. కోటంరెడ్డికి సన్నిహితుడైన కాంట్రాక్టరు రామశివారెడ్డి రికార్డు చేసి పంపారని మావాళ్లు చెబుతున్నారు. డిసెంబరు 25న శ్రీధర్‌రెడ్డి.. చంద్రబాబు ఇంటికి వెళ్లి 2 గంటలు మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తే లోకేశ్‌తో కోటంరెడ్డి మాట్లాడుతున్న విషయాన్ని ఎప్పుడో తెలుసుకునే వాళ్లం కదా?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version