పార్టీ పెట్టడం ఎందుకు.. రెండు రాష్ట్రాలను కలపండి : కెసిఆర్ పై పేర్ని నాని సెటైర్

-

ఏపీలో పార్టీ పెడతానన్న కేసీఆర్ కామెంట్లపై మంత్రి పేర్ని నాని చురకలు అంటించారు. ఇవాళ కేబినెట్ జరిగిన సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నామన్నారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు..? రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలేదా..? అంటూ ఎద్దేవా చేశారు మంత్రి పేర్ని నాని.

ఏపీలో పార్టీ పెట్టడానికి ముందుగా.. తెలంగాణ కెబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్ని పెడితే కేసీఆర్ పెడితే బాగుంటుందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చని.. ఏపీ తెలంగాణ లు ఒకటే రాష్ట్రంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారని తెలిపారు.

ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఎలాంటి బలవంతం లేదని.. ఐచ్చికం గానే వారు తమ నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించారు. ఏపీలో గంజాయి గురించి కెబినెట్లోనే చర్చించామని 2017లోనే అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారని గుర్తు చేశారు మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ కూడా 2018లోనే గంజాయి సాగవుతోందని ట్వీట్ చేశారని చురకలు అంటించారు మంత్రి పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news