జైపూర్‌లో రూ.106, హైదరాబాద్‌లో రూ. 103కు చేరువలో పెట్రోల్ ధరలు

-

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. ప్రతి రోజు ధరలు పెరుగుతూ వాహదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా కూడా పెరిగాయి. అయితే జైపూర్‌లో మాత్రం ఆయిల్ ధరలను అదుపు చేయలేకపోతున్నారు.

గత నెలగా జైపూర్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 105.74కాగా డీజిల్ రూ. 98.48గా విక్రయాలు జరుగుతున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 104.90గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.96,72గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.69గా కొనసాగుతోంది. లీటర్ డీజిల్ రూ. 97.20గా ఉంది.

 

దేశీయంగా ముడి చమురుకు ఏర్పడిన డిమాండ్‌ను బట్టి ఆయిల్ ధరలు నిర్ణయిస్తారని వ్యాపారులు అంటున్నారు. ఇక ఆయిల్ రేట్స్ పెరగడంపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేస్తున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ఆయిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:

Read more RELATED
Recommended to you

Latest news