పీఎం కిసాన్: అన్నదాతలకు 8వ విడత ఆర్థిక సాయం..!

-

కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు 8వ విడత ఆర్థిక సాయం అందించడానికి రెడీ అవుతోంది. ఇది రైతులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరో విడత డబ్బులను అన్నదాతల బ్యాంక్ ఖాతా లో వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ తీసుకు వచ్చిన సంగతి తెలిసినదే. నేరుగా రైతుల ఖాతా లోకి మోదీ సర్కార్ ప్రతి ఏడాది రైతులకు రూ.6,000 అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అన్నదాతలకు అందుతాయి.

అయితే మోదీ అందించే రూ.6 వేలని మూడు విడతల్లో ఇస్తే రూ.2 వేల చొప్పున బ్యాంక్ ఖాతా లోకి వచ్చి చేరతాయి. ఇప్పుడు ఇక 8వ విడత డబ్బులు బ్యాంక్ ఖాతా లోకి రానున్నాయి. ఇక దీని కోసం చూస్తే… పీఎం కిసాన్ 8వ విడత డబ్బులు ఏప్రిల్ నెలలో రైతులకి చేరవచ్చు అని అంటున్నారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలానికి ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతా లోకి వస్తాయి అని అంటున్నారు.

ఎప్పుడు డబ్బులు అందుతాయి అనే దానిపై అయితే స్పష్టం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల ఆరంభం నుంచి ఎప్పుడైనా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వేయొచ్చు. ఈ పీఎం కిసాన్ స్కీమ్ కింద 9 కోట్ల మందికి పైగా డబ్బులు చేరుతున్నాయి. అర్హత లేని వారు కూడా లబ్ది పొందితే మాత్రం ఇబ్బందులు తప్పవట.

 

Read more RELATED
Recommended to you

Latest news