నా చావును కోరుకుంటున్నారు : ప్రధాని మోడీ సంచలనం

-

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్వాది పార్టీ ని టార్గెట్ చేస్తూ… నిన్న విమర్శలు చేశారు మోడీ. కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని… చివరికి తన చావును సైతం కోరుకుంటున్నారు అంటూ విమర్శించారు ప్రధాని మోడీ.

ఎస్పీ అధినేత కేసీఆర్ గతేడాది ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఉద్దేశించి ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు. నిన్న వారణాసి లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… నా చావును కొందరు నేతలు కోరుకుంటున్నారని… ఆ విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వారణాసి ప్రజలతో చివరి వరకు జీవించే అవకాశం దక్కుతున్నందుకు… ప్రాణం పోయే వరకు వారికి సేవ చేసుకునే భాగ్యం దక్కుతున్న అందుకు ఆనందంగా ఉంది అని ప్రధాని మోడీ తెలిపారు. కాగా యూపీలో మార్చి 3, మార్చి ఏడో తేదీ లో చివరి రెండు విడత ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news