ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాక్ మహిళ..!

-

గత 25 ఏళ్లుగా మోదీకి రాఖీ పంపుతున్న పాక్ సోదరి కమర్ మొహిసిన్ షేక్ ఈసారి కూడా రాఖీ పంపారు. వచ్చే ఐదేళ్లు మోదీకి మంచి జరగాలని, మోదీ ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని ప్రార్థిస్తూ ఈ రాఖీ పంపినట్టు తెలిపారు. మోదీని తన భర్త, కుమారుడు కూడా అభిమానిస్తారని ఈ సందర్భంగా కమర్ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌పై మోదీ తీసుకున్న చర్యను కమర్ ప్రశంసించారు.

మోదీ చాలా సాధారణంగా కనిపించినా పనులు మాత్రం గొప్పగా చేస్తారని కితాబునిచ్చారు. తన ఇద్దరు చెల్లెళ్లు కూడా మోదీకి రాఖీ కట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అయితే దాయాది దేశమైన పాకిస్థాన్ దేశానికి చెందిన కమర్ మోహ్‌సిన్ షేక్ ప్రతి రాఖి పండగకి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాఖీ కట్టడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మోదీ పిలిస్తే తాను తప్పకుండా ఢిల్లీ వెళ్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news