జబర్దస్త్ అభికి షాక్ ఇచ్చిన సైబర్ కేటుగాళ్ళు

-

జబర్దస్త్ అభి అలానే గడ్డం నవీన్ లకు సైబర్ నేరగాళ్ళు టోకరా వేశారు. వివరాల్లోకి వెళ్తే జబర్దస్త్ ఫేమ్ అభి హీరోగా , గడ్డం నవీన్ పాయింట్ బ్లాక్ అనే సినిమా నిర్మించారు. అయితే ఇంకా రిలీజ్ కూడా కాని ఈ పాయింట్ బ్లాక్ సినిమా ఆన్ లైన్ లో లీక్ అయింది. విడుదలకు ముందే ఆన్లైన్ లో దర్శనం ఇచ్చింది ఈ సినిమా. సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్షం కావడంతో ఈ సినిమా మీద నిర్మాత గడ్డం నవీన్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తమకు తెలియకుండానే  ఇలా ఆన్ లైన్ లో లీక్ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ సినిమా విడుదల హక్కులను అమెజాన్ ప్రైమ్.. ఆహ లకు ఇచ్చారు. ఫారెన్ లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. దాని నుండి డౌన్ లోడ్ చేసిన కొన్ని యు ట్యూబ్ ఛానళ్ళు సినిమాని విడుదల చేసాయి.  ఈ సినిమా తెలుగులో ఈ వారంలో విడుదల కానుండగా సినిమా లీక్ అవ్వడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. అందరం కలిసి డబ్బు జమ చేసుకుని సినిమా తీశామని.. పోలీసులు స్పందించి సినిమాని పైరసీ నుంచి కాపాడాలని నిర్మాత అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news