పోలీసుల కార్డన్ సెర్చ్

-

రంగారెడ్డి జిల్లాలోని మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మీర్ పేటలో గల రాజీవ్ గృహ‌కల్ప కాలనీలో 250 మంది పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సెర్చ్ లో భాగంగా ఇప్పటికి 15మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 25 బైకులు, 4 ఆటోలను సీజ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నగరంలో సైఫాబాద్ పీఎస్ పరిధిలోనూ, ఖైరతాబాద్ బడా గణేష్ వెనుక బస్తీలో సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ ఆధర్యంలో పోలీసు సిబ్బంది కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news