మోహన్ బాబు పై పోలీసు కేసు నమోదు !

-

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కు ఊహించని ఈ పరిణామం చోటు చేసుకుంది. మంచు మోహన్ బాబు పై కేసు నమోదు చేయాలని… తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల పెంపకం దారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మా ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో… తమ మనోభావాలను దెబ్బ తినేలా మంచు మోహన్ బాబు మాట్లాడారని… ఈ నేపథ్యంలోనే తాను ఆయన పై … పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు.. ఆ సంఘం నేతలు చెప్పారు.

గొర్రెలు మరియు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.. స్థానిక పోలీసులకు మంచు మోహన్ బాబు పై ఫిర్యాదు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా… ” మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి? అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్.. గొర్రెలు మేపుకునే వాడి దగ్గర కూడా ఫోన్ ఉంది. మన గొడవను వాళ్లు కూడా ఫోన్ లో రికార్డు చేసే అవకాశం ఉంటుంది. ఈ న్యూసెన్స్ ను ఇప్పుడే ఆపేద్దాం “అంటూ మోహన్ బాబు పేర్కొన్నారు.

అయితే మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు… గొర్రెల కాపరులను కించపరిచేలా ఉన్నాయని ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. మోహన్బాబు పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు కలికినేని తీరీష్, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బసినబోయిన గంగరాజు, రాము, లాలయ్య ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news