రాజస్థాన్ కాంగ్రెస్ లో ముసలం.. ఏ క్షణమైనా గెహ్లాట్ ప్రభుత్వం కూలే ఛాన్స్ !

-

రాజస్థాన్ కాంగ్రెస్ లో ముసలం నెలకొంది. గెహ్లాట్ కు వ్యతరేకంగా కాంగ్రెస్ ఎమ్.ఎల్.ఏలు అర్ధరాత్రి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గా అశోక్ గెహ్లాట్ కొనసాగుతారని స్పష్టం చేసారు మంత్రి ప్రతాప్ సింగ్.

అశోక్ గెహ్లాట్ అభ్యర్ధిత్వంపై ముఖ్యమంత్రి తో పాటు, ఇతర నాయకులు చర్చించి, నిర్ణయం తీసుకుంటారని మంత్రి ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు.

 

తనకు మద్దతుగా ఉన్న ఎమ్.ఎల్.ఏలను, ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉన్నారు. అదే విధంగా, బల ప్రదర్శన చేయాలన్నదే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా కనిపిస్తోంది. అటు కేరళలో సచిన్ పైలట్…ఉన్నారు. కేరళలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర లో పాల్గొనేందుకు సచిన్ పైలట్…వెళ్లారు. ఆయన మరో రెండు రోజుల్లో రాజస్థాన్ రానున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news