బ్రేకింగ్: జేసీకి బెయిల్

-

టిడిపి సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కరోనా సోకిందని గుండెకు ఆపరేషన్ జరిగిందని కాబట్టి తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న ఎస్సీ ఎస్టీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇటీవల బస్సు అక్రమాల విషయంలో జైలుకు వెళ్లిన ఆయన… బెయిల్ పై తిరిగి వచ్చే క్రమంలో ఒక పోలీస్ అధికారిని బొందల దీన్నే గ్రామం వద్ద కులం పేరుతో దూషించారు. అదే విధంగా కరోనా నిబంధనలను ఆయన ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కడప జైలులో 317 మందికి కరోనా సోకింది.

Read more RELATED
Recommended to you

Latest news