సీఎం ప‌ద‌వికి కేజ్రీవాల్ రాజీనామా

-

ఢిల్లీ రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి.లిక్క‌ర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుద‌లైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. జైలు నుంచి వచ్చిన రెండు రోజుల్లోనే కేజ్రీవాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని, తన భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని మీడియాకు స్ప‌ష్టం చేశారు.

తాను నిజాయితీగా ఉన్నానని భావిస్తే.. త‌న‌కు ఓటేసి మళ్లీ గెలిపించాలని కోరుతూ ఆయ‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిపించాలని కేంద్రానికి సవాల్ విసిరారు.రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా… ఎన్నికల్లో ప్రజా తీర్పు వచ్చే వరకూ సీఎం పీఠంపై కూర్చోను..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లోనే జరగనున్నాయి… ప్రజాకోర్టులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాను.. ప్రజల ఆమోదంతోనే మ‌ళ్ళీ సీఎం పదవిని చేపడతాను’ అని కేజ్రీవాల్ ప్రకటించారు.

తన స్థానంలో వేరొకరు సీఎంగా బాధ్యతలు చేపడతారని తెలిపారు సీఎం కేజ్రీవాల్‌. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయని, కానీ నవంబరులోనే నిర్వ‌హించాల‌ని ఆయన డిమాండ్ చేశారు.ఢీల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లరాదని, ఫైల్స్‌పై సంతకాలు చేయరాదని షరతు విధించింది.

ఈడీ కేసులో వేరే ధర్మాసనం ఈ కండిషన్ పెట్టడంతో.. సీబీఐ కేసులో బెయిలిచ్చిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆ నిబంధనలు తాము ఎత్తివేయలేమని పేర్కొంది. కానీ, ఆ ధర్మాసనం ఆదేశాలను తప్పుబట్టింది.దీంతో ఢిల్లీ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నిక‌ల‌కు కేజ్రీవాల్ సిద్ధం కావ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టి మ‌ళ్ళీ ఢిల్లీ పీఠాన్ని కైవ‌సం చేసుకుంటామ‌ని కేజ్రీవాల్ ధీమాగా ఉన్నారు.అదే జ‌రిగితే కేజ్రీవాల్‌ను ఆప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

కేజ్రీవాల్ మీడియాతో్ మాట్లాడుతూ ఇంకుమ‌న్నారంటే..- కుట్రపై సత్యమే గెలిచిందని అన్నారు. దేశాన్ని బలహీన పరుస్తున్న, విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని ఆయన ప్రకటించారు. ఇక, తీర్పు సమయంలో సీబీఐ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. పంజరంలో చిలుకలా ప్రవర్తించడం మానుకోవాలని హితవు పలికింది. సుదీర్ఘంగా జైలులో ఉంచడమంటే రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగంలోని అధికరణం 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో కేసు నమోదు చేసిన తర్వాత 22 నెలలు మౌనంగా ఉన్న సీబీఐ..ఈడీ కేసులో ఆయనకు బెయిలొస్తున్న తరుణంలో క్రియాశీలకంగా మారడాన్ని తప్పుబట్టింది.ఈ ప‌రిణామాల‌తో ఢిల్లీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగి వేడెక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news