తిరుమల: ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడి ఘటన తెలుగుదేశం కుట్రేనని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన శ్రీనివాస్ కోటి రూపాయలతో భూమి కొనుగోలు చేసేందుకు బేరసారాలు ఆడాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. టిడిపి నేతలు వెంటనే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హీరో శివాజీ పథకం ప్రకారమే అమెరికాకు పారిపోయాడని రోజా ఆరోపించారు.ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తుంటే వెగటు వస్తోందని రోజా అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్న నేతలు దాడికి గురైన వారిపైనే వెటకారంగా మాట్లాడటం సరికాదన్నారు. జగన్పై దాడి జరిగిన గంటలోనే నిందితుడు జగన్ అభిమాని అని డీజీపీ చెప్పడం, ఫ్లెక్సీని విడుదల చేయడం వెనుక కుట్ర ఉన్నట్లు తెలుస్తోందని రోజా అన్నారు.
జగన్పై దాడి టిడిపి కుట్రే: రోజా
By Anil Kumar
-
Previous article
Read more RELATEDRecommended to you
బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది చెల్లని రూపాయి : ఈటెల రాజేందర్
మల్కాజిగిరి పార్లమెంట్ : మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జవహర్ నగర్, దమ్మాయిగూడ...
Ganesh -
చంద్రబాబు, పవన్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ
ఎన్నికల సందర్భంగా రాజకీయ నేతలు ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. కొన్ని...
Ganesh -
టిడిపిలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసిన వేళ అధికార వైసీపీకి...
Ganesh -