వైసీపీలోకి త్వరలో భారీగా వస్తారు: బొత్సా కామెంట్స్

-

ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నేడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. నోటి మాటల ద్వారా మనషి మాట విలువ తెలుస్తుందని అన్నారు. సభ్య సమాజంలో గౌరవంగా ఉండేవాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఎన్ని మాటలైనా చెబుతారని ఆయన విమర్శించారు.

రాజకీయనాయకులు అదుపులో ఉండాలని అన్నారు. పార్టీ పట్ల, పనితీరు పట్ల అభిమానం ఉన్నవారు ఎవ్వరైనా పార్టీలోకి వస్తారని ఆయన అన్నారు. త్వరలో కూడా కొంతమంది పార్టీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. మర్రిపాలెం వెళ్ళే మార్గం వచ్చే నెలలో ప్రారంభిస్తామని అన్నారు. ఫ్లైఓవర్ మొత్తం పూర్తెయ్యాక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. మెట్రో ఆఫిస్ త్వరలో ప్రారంభిస్తాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version