`సాయిరెడ్డీ… జేట్యాక్స్ వసూలు పూర్తయిందా? లోడ్ ఎత్తాలి`.. స‌రిలేరు సెటైర్లు వేస్తున్న బుద్ధా వెంకన్న

-

వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి వ‌ర్సెస్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న మ‌ధ్య ట్విట్ల వార్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ… నిజాలను వెలికి తీసేందుకు వైసీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయ‌డంతో మ‌రింత రాజకీయ వేడిని రాజేసింది. ఈ క్ర‌మంలోనే 40 ఇండస్ట్రీకి ఏమైందంటూ చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

‘సాయిరెడ్డీ… జేట్యాక్స్ వసూలు పూర్తయిందా? లోడ్ ఎత్తాలి’ అని జగన్ అడుగుతుంటారని బుద్ధా వెంకన్న స‌రిలేరు సెటైర్లు వేశారు. మద్యపాన నిషేధం పేరుతో చెత్త కంపెనీల దగ్గర జేట్యాక్స్ వసూలు చేస్తూ… మద్యానికి అలవాటు పడినవారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. పీపీఏలను ముట్టుకుంటే కొట్టిన షాక్ కు మొహం కందగడ్డలా మారిందని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అని అరిచినా… ఎలాంటి ఔట్ పుట్ లేకపోయేసరికి డీలా పడ్డారని చెప్పారు. 43 వేల కోట్లు కొట్టేసిన 9 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏం చేయాలో పాలుపోక సిట్ వేసుకుని కూర్చున్నారని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news