ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ చంద్రబాబు ఆవేదన

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెన్సషనల్ కామెంట్స్ చేశాడు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అన్యాయముగా ప్రజలను మోసం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికలలో వైసీపీ తమ అభ్యర్థులను బెదిరించి నామినేషన్ లను విత్ డ్రా చేసుకునేలా చేశారంటూ మండిపడ్డారు చంద్రబాబు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో మాట్లాడుతూ … గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నకిలీ సర్టిఫికెట్ లను ఉపయోగించి ధోని ఓట్లను నమోదు చేశారు, దీని ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ విధంగా దాదాపుగా ఈ నాలుగు సంవత్సరాలలో జరిగిన అన్ని ఎన్నికలలోనూ అధికార పార్టీ అప్రజాస్వామ్యంగా వ్యవహరించిందని తెలిపారు చంద్రబాబు.

ఇంకా వీరికి వ్యతిరేకంగా ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా , వారిపైన కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారంటూ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news