చంద్రబాబు, లోకేష్ కోలుకోవాలి : చిరు ఆస‌క్తిక‌ర ట్వీట్

-

గ‌త రెండు రోజుల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ లోని టీడీపీ లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తో పాటు టీడీపీ అధినేత చంద్ర బాబు కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. వీరితో పాటు టీడీపీ లో చాలా మంది నాయ‌కుల‌కు కరోనా బారిన ప‌డ్డారు. అయితే చంద్ర బాబు, లోకేష్ క‌రోనా బారిన ప‌డటంతో ప‌లువురు సెల‌బ్రెటీలు సోష‌ల్ మీడియా ద్వారా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.

ఇప్ప‌టికే చంద్ర‌బాబు క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. తాజా గా మెగా స్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశాడు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, అలాగే నారా లోకేష్ క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మెగా స్టార్ చిరంజీవి త‌న అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఒక పోస్టు చేశారు. క‌రోనా వ‌చ్చిన స‌మ‌యంలో చంద్ర బాబు, నారా లోకేష్ జగ్ర‌త్త గా ఉండాల‌ని అన్నారు.అలాగే త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news